Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఒకే రోజు 327 కేసులు.. ఇకపై మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (11:18 IST)
గుంటూరులో కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో జిల్లా యంత్రాంగం మరిన్ని కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా గురువారం 327 పాజిటివ్ కేసులు నమోదైనాయి. గుంటూరు సిటీలో మాత్రం 185 కేసులు నమోదైనాయి. దీంతో జిల్లా కలెక్టర్. శామ్యూల్ ఆనంద కుమార్ నగరంలోని అనేక నివాస ప్రాంతాలతో కూడిన బ్రాడీపేట్, లక్ష్మీపురం, శ్రీనగర్ కాలనీ మరియు అమరావతి రోడ్డులోని అనేక ప్రాంతాలను కలిగి ఉన్న 14 కంటైన్మంట్ జోన్లను ప్రకటించారు.
 
బ్రాడీపేటలో 40 కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రోజులలో శుక్రవారం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచాలని టోకు, రిటైల్ సంఘాలు ప్రకటించాయి. జాయింట్ కలెక్టర్లు, డిఎంహెచ్‌ఓలతో కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్, కరోనా రోగులను గుర్తించడానికి నిఘా బృందాలను సేవల్లోకి తీసుకువస్తామని చెప్పారు. 
 
అన్ని మండలాల్లో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇందులో భాగంగా 20 కేసులతో మంగళగిరి మొదటి స్థానంలో ఉంది. ప్రజలకు కరోనా పరీక్షలు చేయడం.. చికిత్స అందించడం వంటివి జరుగుతున్నాయని.. కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు శామ్యూల్ తెలిపారు. ఇంకా దుకాణాదారుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరిచి వుంచేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments