Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఒకే రోజు 327 కేసులు.. ఇకపై మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (11:18 IST)
గుంటూరులో కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో జిల్లా యంత్రాంగం మరిన్ని కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా గురువారం 327 పాజిటివ్ కేసులు నమోదైనాయి. గుంటూరు సిటీలో మాత్రం 185 కేసులు నమోదైనాయి. దీంతో జిల్లా కలెక్టర్. శామ్యూల్ ఆనంద కుమార్ నగరంలోని అనేక నివాస ప్రాంతాలతో కూడిన బ్రాడీపేట్, లక్ష్మీపురం, శ్రీనగర్ కాలనీ మరియు అమరావతి రోడ్డులోని అనేక ప్రాంతాలను కలిగి ఉన్న 14 కంటైన్మంట్ జోన్లను ప్రకటించారు.
 
బ్రాడీపేటలో 40 కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రోజులలో శుక్రవారం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచాలని టోకు, రిటైల్ సంఘాలు ప్రకటించాయి. జాయింట్ కలెక్టర్లు, డిఎంహెచ్‌ఓలతో కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్, కరోనా రోగులను గుర్తించడానికి నిఘా బృందాలను సేవల్లోకి తీసుకువస్తామని చెప్పారు. 
 
అన్ని మండలాల్లో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇందులో భాగంగా 20 కేసులతో మంగళగిరి మొదటి స్థానంలో ఉంది. ప్రజలకు కరోనా పరీక్షలు చేయడం.. చికిత్స అందించడం వంటివి జరుగుతున్నాయని.. కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు శామ్యూల్ తెలిపారు. ఇంకా దుకాణాదారుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరిచి వుంచేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరుణ్ సందేశ్ 'నింద' లో ‘సంకెళ్లు’ పాట విడుదల చేసిన గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్

జ్యోతిక, సూర్య నిర్మాణంలో కార్తీ, అరవింద్ స్వామి ఫ్రెండ్ షిప్ చిత్రం పేరు మెయ్యళగన్

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments