Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైజర్‌పై షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్‌ తీసుకున్న నర్సు మృతి..!

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (09:48 IST)
కరోనా వ్యాక్సిన్లు ఆమోదం పొందుతున్నాయని, తర్వలోనే మహమ్మారి నుంచి బయటపడతామని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఇదో షాకింగ్ వార్తే. ఎందుకంటే? కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ఓ నర్సు హఠాన్మరణం చెందారు. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల్లో నర్సు చనిపోయినట్లు సమాచారం. ఎన్నో ప్రమాణాలతో తయారుచేసిన వ్యాక్సిన్లు వికటిస్తున్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 
 
సోనియా ఏస్‌వెడో అనే 41ఏళ్ల పోర్చుగీసు నర్సు నూతన సంవత్సరం తొలిరోజు అకస్మాత్తుగా చనిపోయింది. అంతకు 48 గంటల ముందు ఫైజర్ బయోఎన్‌టెక్ కరోనా టీకా (పైజర్ వ్యాక్సిన్)ను ఆమె తీసుకున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న నర్సు చనిపోవడంతో వ్యాక్సిన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 
 
పోర్టోలోని పోర్చుగీసు ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్‌మమెంట్‌లో సోనియా విధులు నిర్వహించేవారు. ఆమెకు సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. హెల్త్ వర్కర్ అయిన సోనియా డిసెంబర్ 30న ఫైజర్ బయోఎన్‌టెక్ కరోనా టీకా తీసుకున్నారు. 
 
తన తల్లి మరణంపై కారణాలు తెలియాలంటూ చనిపోయిన నర్సు సోనియా కుమార్తె అబిలియో ఏస్‌వెడో ఉన్నతాధికారులను కోరారు. విచారణ జరిపించి నిజనిజాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. తమ వద్ద పనిచేస్తున్న నర్సు సోనియా చనిపోవడంపై పోర్చుగీసు ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్‌మమెంట్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments