Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వ్యాక్సిన్ వాడిన నర్సుకు పాజిటివ్.. ఎలా..?

కరోనా వ్యాక్సిన్ వాడిన నర్సుకు పాజిటివ్.. ఎలా..?
, బుధవారం, 30 డిశెంబరు 2020 (20:51 IST)
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ వచ్చేస్తుందని అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇంకా కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు బలంగా నమ్ముతున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఫైజర్, మోడెర్నా సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. 
 
దాదాపుగా 21 లక్షల మంది ఈ టీకాలను తీసుకున్నారు. అయితే, క్యాలిఫోర్నియాకు చెందిన మాధ్యు డబ్ల్యూ అనే ఓ నర్స్ ఇటీవలే వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల్లో అయన కరోనా బారిన పడ్డారు.
 
వ్యాక్సిన్ తీసుకున్నాక తీవ్రమైన తలనొప్పి, చలి జ్వరం వంటివి రావడంతో కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల తరువాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, పాజిటివ్ వచ్చినందువలన భయపడాల్సిన అవసరం లేదని ఫైజర్ కంపెనీ చెప్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యవసాయానికి శాశ్వత ప్రాతిపదికన ఉచిత విద్యుత్‌: సర్కారు ప్రయత్నాలు