Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ కేసులు.. భారత్‌లో లాక్‌డౌన్ తప్పదా?

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (20:37 IST)
ఒమిక్రాన్ కేసులు భారత్‌లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. మొదట కరోనా ఫస్ట్‌ వేవ్‌ వ్యాప్తి చెందినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 3 నెలల పాటు లాక్‌డౌన్‌ విధించాయి. ఆ తర్వాత డెల్టా వేరియంట్ రూపంలో 3రెట్ల వేగంతో మరోసారి కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో మరోమారు లాక్‌డౌన్‌కు విధించక తప్పలేదు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ డెల్టా వేరియంట్ కంటే 6రెట్ల వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) వెల్లడించింది.

 
 
ఈ నేపథ్యంలో మరోసారి భారత్‌లో లాక్‌డౌన్‌ తప్పదా..? అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మెదులుతోంది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగూళూరు ఎయిర్‌పోర్టుకు నవంబర్‌ 11న ఒకరు, నవంబర్‌ 20 మరొకరు ఒమిక్రాన్‌ సోకిన దేశాల నుంచి వచ్చారు. 

 
అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యలు కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని ఐసోలేషన్‌లో పెట్టి జినోమ్‌ సీక్వెన్సికి పంపించారు. జినోమ్‌ ఫలితాల్లో ఒమిక్రాన్‌గా తేలడంతో భారత్‌లో మరోసారి టెన్షన్‌ మొదలైంది. 

 
ఒమిక్రాన్‌ సోకిన వారి కాంటాక్ట్‌ లిస్టును కూడా ట్రేస్‌ చేసి ప్రస్తుతం వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు ఒమిక్రాన్‌ సోకిన దేశాల్లో ఒకటైన బ్రిటన్‌ నుంచి తెలంగాణకు వచ్చిన మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జినోమ్‌ సీక్వెన్సీకి ఆమె శాంపిల్స్‌ను వైద్యులు పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments