Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ బాధిత వైద్యుడిని కలిసిన ఐదుగురికి పాజిటివ్!!

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (20:21 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ కరోనా వేరియంట్ భారత్‌లోకి అడుగుపెట్టింది. కర్నాటక రాష్ట్రంలో ఈ వైరస్ కేసులు రెండు నమోదయ్యాయి. వీరిలో ఒకరు వైద్యుడు కాగా, మరొకరు విదేశీ పౌరుడు. ఆయన తిరిగి తన స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే, కర్నాటకకు చెందిన ఒమిక్రాన్ బాధిత వైద్యుడిని కలిసిన ఐదుగురికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఒక్కసారిగా కర్నాటక రాష్ట్రంలో కలకలం చెలరేగింది.

 
 




ఈ విషయంపై కర్నాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె.సుధాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు వైద్యుడని చెప్పారు. ఈయన్ను కలిసిన వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా తేలిందన్నారు. అంతేకాకుండా, డాక్టరును కలిసిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఐదుగురికి నిర్ధారణ అయిందన్నారు. 

 
అదేసమయంలో ఒమిక్రాన్ పాజిటివ్‌ వచ్చిన వైద్యుడితో పాటు మిగిలిన ఐదుగురిని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచినట్టు వివరించారు. అయితే, వీరిలో ఎవరికీ ప్రమాదకర పరిస్థితి లేదని వారందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నవారేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments