తెలంగాణాలో పెరుగుతున్న ఒమిక్రాన్... పాజిటివ్ కేసులు 21

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (12:09 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ క్రమక్రమంగా పాగా వేస్తోంది. ఒక్కో కేసుతో మొదలైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 21కు చేరుకుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. 
 
ఇటీవల దుబాయ్ నుంచి ఈ గూడెంకు వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ అనితేలింది. దీంతో బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా కొత్త వేరియంట్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరి ఫలితాలు రావాల్సివుంది. 
 
మరోవైపు, జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూడటంతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల విదేశాల నుంచి పది మందికి, ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments