Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో కరోనా విజృంభణ.. బీహార్‌లో ఆగస్టు 1 నుంచి 16వరకు లాక్‌డౌన్

Webdunia
బుధవారం, 29 జులై 2020 (15:52 IST)
ఒడిశాలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,068 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తం కేసులు 30వేలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటి వరకు 29,175 కేసులు నిర్ధారణ అయ్యాయి. 10,919 యాక్టివ్‌ కేసులు ఉండగా, 18,061 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కోవిడ్‌-19 ప్రభావంతో 159 మంది మృతి చెందారు. మరో 36 మంది మృతి చెందారు.
 
కాగా, గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 48,513 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా, 768 మంది మృతి చెందారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 15,31,669కు చేరాయని తెలిపింది.
 
అలాగే బీహార్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఆగస్టు 16 వరకు పొడిగించారు. ఆగస్టు 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు ఆగస్టు 1 నుంచి 16 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. బీహార్‌లో కరోనా కేసుల సంఖ్య 41 వేలు దాటగా ఇప్పటి వరకు 253 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments