Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా రోగికి రూ. 17.5 లక్షలు బిల్లు, ప్రైవేటు ఆస్పత్రి చేతివాటం ఏమిటి?

కరోనా రోగికి రూ. 17.5 లక్షలు బిల్లు, ప్రైవేటు ఆస్పత్రి చేతివాటం ఏమిటి?
, బుధవారం, 29 జులై 2020 (14:42 IST)
హైదరాబాదు నగరంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. కరోనా సోకిన బాధితులు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే వారినుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ జలగల్లా రక్తం పీల్చినట్టుగా పీలుస్తున్నాయి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఓ వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ప్రైవేటు ఆస్పత్రి వేసిన ఫీజును చూసి గుండేపోటుతో మరణించాడు.
 
అంతేకాక కరోనా సోకిన ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆస్పత్రులలో చేరితే సాటి వైద్యులని కూడా చూడకుండా వారిపై కూడా ఫీజులు బాదుతున్నారు. ఏమని ప్రైవేటు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారిని బంధిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా కరోనా రోగికి రూ. 17.5 లక్షలు బిల్లు వేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకెళితే కరోనా భాదపడుతున్న వ్యక్తి, అతని భార్య 10 రోజుల క్రితం హైదరాబాదు సోమాజిగూడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.
 
అక్కడ 10 రోజుల పాటు వైద్యం అందుకున్న ఆ వ్యక్తికి రూ. 17.5 లక్షల బిల్లు వేశారు. కాగా ఆ బిల్లులో 8 లక్షలు వారి కుటుంబ సభ్యులు కట్టారు. ఈ క్రమంలో బాధితుని భార్య కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం మొత్తం బిల్లు కడితేనే భార్య మృతదేహాన్ని ఇస్తాననడంతో ఆ మాటలకు బాధితుడు ఆవేదనతో గుండెపోటు వచ్చి మరణించాడు. ప్రస్తుతం ఆస్పత్రి యాజమాన్యం బాధితుడి కుటుంబాన్ని బెదిరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల బాదుడు మామూలుగా వుండటంలేదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్‌‌ 19 రోగుల కోసం ‘ఫవివిర్’ను భారత్‌లో విడుదల చేసిన హెటిరో