Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా... 24 గంటల్లో 131 మంది ఖాకీలకు సోకింది...

Webdunia
గురువారం, 28 మే 2020 (17:09 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. తాను మరింతగా వ్యాప్తి చెందకుండా అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసులను సైతం వదిలిపెట్టడం లేదు. ఫలితంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోలీసులు ఈ వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా, మహారాష్ట్రలో అయితే, ఇప్పటివరకు ఏకంగా 2095 మంది ఈ వైరస్ బారినపడ్డారు. గత 24 గంటల్లో 131 మంది పోలీసులకు ఈ వైరస్ సోకింది. 
 
వాస్తవానికి మహారాష్ట్రను కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెల్సిందే. అదేసమయంలో పోలీస్ శాఖలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతున్నాయి. గత 24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇద్దరు పోలీసులు కొవిడ్‌-19తో మృతి చెందారు. ఇప్పటి వరకు 2095 మంది పోలీసులకు కరోనా సోకింది. మృతుల సంఖ్య 22కు చేరింది. 897 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 56,948 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,897 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి 17,918 మంది కోలుకున్నారు. రెండో స్థానంలో తమిళనాడు(18,545 పాజిటివ్‌ కేసులు), మూడో స్థానంలో ఢిల్లీ(15,257 పాజిటివ్‌ కేసులు) ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments