డీజే సౌండ్‌తో మిడతలు పరార్.. పంటపొలాల్లో సౌండ్ బండ్లు

Webdunia
గురువారం, 28 మే 2020 (16:56 IST)
DJ sound
డీజే సౌండ్‌తో మిడతలు పారిపోతున్నాయి. కరోనా వైరస్ తర్వాత భారత్‌లోకి మిడతల దండు పంటలను నాశనం చేస్తుంది. 26 ఏండ్లలో ఎన్నోసార్లు మిడతల దండు మన దేశంలోకి వచ్చాయి. కానీ, ఇంత భారీ సంఖ్యలో దాడి చేయడం ఇదే తొలిసారి అంటున్నారు నిపుణులు.
 
ఈ మిడతల దండును తరిమికొట్టేందుకు కొంతమంది రైతులు సరికొత్తగా డీజేను ఉపయోగిస్తున్నారు. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పోలీస్‌ అధికారి రాహుల్‌ శ్రీవాస్తవ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింద. రాకాసి మిడతలు పంటలను నాశనం చేస్తున్న వేళ.. డీజేను ఉపయోగించి వాటిని రైతులు తరిమికొడుతున్నారు. 
 
ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పంటకు మిడతలు నష్టం కలిగించాయి. 35వేల మందికి సరిపడా ఆహారాన్ని ఈ దండు ఒక్కరోజులో తినేస్తాయట. ఇవి వాటి శరీర బరువుకు మించి ఆహారం తీసుకుంటాయి. 
 
చేతికొచ్చిన పంటను ఈ మిడతల ద్వారా నష్టపోతుంటే చూస్తూ ఉండలేక రైతులు డప్పు కొట్టడం, చప్పట్లు కొట్టడం లాంటి పనులు చేస్తున్నారు. నిరంతరం ఈ పనులు చేయడం కష్టమని డీజే వాహనాన్ని తరలించి పంటపొలాల్లో ప్లే చేస్తున్నారు రైతులు. ఈ శబ్దానికి మిడతలు తోక ముడవక తప్పదంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments