Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిజిటల్ అగ్రి-లావాదేవీలను ప్రోత్సహించడానికి రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేసిన అగ్రిబజార్

Advertiesment
AgriBazaar
, శుక్రవారం, 15 మే 2020 (19:35 IST)
వ్యవసాయ ఉత్పత్తులు వృథా కాకుండా చూసుకోవడం మరియు వ్యవసాయ సరఫరా గొలుసు అంతరాయాలను తగ్గించడం కోసం భారతదేశపు ప్రధాన ఆన్‌లైన్ అగ్రి-ట్రేడింగ్ సంస్థ అగ్రిబజార్.కామ్, కోవిడ్-19 లాక్‌డౌన్ కాలంలో రైతులకు దాని ప్లాట్‌ఫాంపై రిజిస్ట్రేషన్ ఛార్జీలను రద్దు చేసినట్లుగా ప్రకటించింది. ఈ పరిమిత కాల ఆఫర్ ద్వారా రైతులు వారి ఇళ్ల నుండి భద్రతతో మరియు వాణిజ్యాన్ని కొనసాగిస్తూ రైతులను కొనుగోలుదారులతో కనెక్ట్ చేయడం చేస్తుంది. 
 
2016లో ప్రారంభమైనప్పటి నుండి ఈ యాప్ 14,000 కోట్ల రూపాయల జి.ఎం.వి నమోదు చేసుకున్నది. ఈ ఆఫర్‌కు రైతు సంఘం నుండి ఉత్సాహభరితమైన స్పందన లభించింది. లాక్డౌన్ పరిమితులు, సమీపంలోని మార్కెట్ల మూసివేతలు మరియు లాజిస్టిక్స్ సవాళ్ల కారణంగా తమ ఉత్పత్తులను అమ్మలేకపోతున్న చిన్న వ్యవసాయ యజమానులు చాలా ప్రయోజనం పొందారు. అగ్రిబజార్.కామ్ యాప్, తన టోల్-ఫ్రీ ఆల్ ఇండియా నంబర్ + 91 9090397777లో డౌన్‌లోడ్‌లు మరియు టెలి-రిజిస్ట్రేషన్ల ద్వారా 400% ఎక్కువ రిజిస్ట్రేషన్లను పొందింది.
 
ఏప్రిల్ 2020లో, అగ్రిబజార్.కామ్ యాప్, పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు మరియు ధాన్యాలు వంటి వ్యవసాయ ఉత్పత్తులను, 8,000 ట్రక్కులలో లడఖ్, సిక్కిం మరియు లక్షద్వీప్ వంటి దూర ప్రాంతాలకు కూడా రవాణా చేయడానికి విజయవంతంగా దోహదపడింది. బారామతిలోని ద్రాక్ష రైతుల నుండి కాశ్మీర్‌లో ఆపిల్ పండించేవారి వరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ & హర్యానా వంటి రాష్ట్రాల్లో సాగు చేసేవారి వరకు ఈ లాక్డౌన్ సమయంలో స్పందన ప్రోత్సాహకరంగా ఉంది.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అగ్రిబజార్.కామ్ సహ వ్యవస్థాపకుడు & సిఇఒ అమిత్ అగర్వాల్, “భారతదేశంలో వ్యవసాయం, కోవిడ్-19 కారణంగా అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంది; అయినా కూడా, ప్రభుత్వం మరియు స్థానిక పరిపాలన యొక్క ప్రయత్నాలతో, భారతీయ రైతు యొక్క డిజిటల్ ప్రయాణం అటువంటి కష్ట సమయాల్లో ఉపశమనం కలిగింది.
 
కోవిడ్-19 సమయంలో రైతులు రుసుము లేకుండా మా ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవడానికి వీలు కల్పించడం ద్వారా, ప్రస్తుత పరిమితుల మధ్య వారి ఉత్పత్తులను విక్రయించడానికి వారికి సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము, 'దో గజ్ కీ దూరి’ని నిర్వహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుని సమర్థించారు.
 
ఈ మహమ్మారి చిన్నవారికి ఎక్కువ ఆవశ్యకతను సృష్టించింది, ఉదాహరణకు, భారతీయ వ్యవసాయ యజమానులు, మంచి ఒప్పందాల కోసం కాకుండా మొత్తం భద్రత మరియు ఆరోగ్యం కోసం, అగ్రిబజార్.కామ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు మారడం వంటి ఆవశ్యకతను సృష్టించింది. ”
 
అగ్రిబజార్.కామ్ ప్లాట్‌ఫామ్‌లో వ్యాపారం చేయడానికి వారి సభ్యులు మరియు ఎక్కువ మంది రైతులను ఆన్‌బోర్డ్ చేయడానికి సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ సంఘాలు మరియు ఎఫ్.పి.ఓలతో చర్చలు జరుపుతోంది. 
 
ఇది విక్రేత (రైతు) మరియు కొనుగోలుదారు నేరుగా ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయ్యిందని, సమయం మరియు ఖర్చుతో ఆదా అవుతుందని ఇది నిర్ధారిస్తుంది. ఒప్పందం పూర్తయిన తర్వాత, అగ్రిబజార్ యొక్క గ్రౌండ్ సిబ్బంది రైతులకు లాజిస్టిక్స్ మద్దతును నిర్ధారిస్తారు. వస్తువుల డెలివరీపై, రైతుకు కంపెనీ అగ్రిపే ప్లాట్‌ఫామ్ ద్వారా సమయానుసారంగా చెల్లించబడుతుంది. 
 
అగ్రిబజార్.కామ్ యాప్, ఐఓఎస్ మరియు యాప్ స్టోర్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. స్మార్ట్ మరియు ఫీచర్ ఫోన్ రెండింటిలోనూ ఆపరేట్ చేయవచ్చు. రైతులు అఖిల భారత టోల్ ఫ్రీ నంబర్ + 91 9090397777కు డయల్ చేయవచ్చు. ఒక కంపెనీ ఎగ్జిక్యూటివ్ వారికి వేదికపై నమోదు చేసుకోవడానికి మరియు ట్రేడింగ్ ప్రారంభించడానికి సమాచారాన్ని అప్‌లోడ్ చేయడానికి మార్గనిర్దేశం చేయవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుద్ధిమాంద్య వికలాంగురాలిపై సమీప బంధువు అత్యాచారం.. ఎక్కడ?