Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుద్ధిమాంద్య వికలాంగురాలిపై సమీప బంధువు అత్యాచారం.. ఎక్కడ?

బుద్ధిమాంద్య వికలాంగురాలిపై సమీప బంధువు అత్యాచారం.. ఎక్కడ?
, శుక్రవారం, 15 మే 2020 (19:32 IST)
అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. బుద్ధిమాంద్యం వికలాంగురాలిపై సమీప బంధువు ఒకరు లైంగికదాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ వికలాంగురాలిని ఏకంగా తల్లిని చేశాడు. ఆ తర్వాత మరో కామాంధుడు ఆ వికలాంగురాలికి సహాయం చేస్తున్నట్టుగా లోబరుచుకుని అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గుంతకల్లు మండలంలోని ఓ తండాకు చెందిన ఓ యువతి పుట్టుకతోనే బుద్ధిమాంద్యం ఉంది. పైగా, చిన్నవయసులోనే తల్లిదండ్రులు కోల్పోయింది. దీంతో ఇరుగు పొరుగు ఇళ్ళవారు పెట్టింది తింటూ, భిక్షమెత్తుకుంటూ జీవిస్తూ వస్తోంది.
 
ఈ క్రమంలో ఈమెకు వరుసకు బాబాయ్‌ అయ్యే ఓ వ్యక్తి ఆమె పాలిట రాబందువయ్యాడు. మాయమాటలతో లొంగదీసుకుని కామవాంఛ తీర్చుకున్నాడు. దీంతో ఆ వికలాంగురాలు గర్భందాల్చి మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
ఆ తర్వాత నరసాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్ను ఆమెపై పడింది. సహాయం పేరిట ఆమె వద్దకు వచ్చే ఆ వ్యక్తి తరచూ లైంగిక వాంఛ తీర్చుకోసాగాడు. అలా సమీప బంధువు, పరాయి వ్యక్తి చేతిలో మోసపోయింది. ఇటువంటి మహిళ తండాలో ఉండేందుకు వీలు లేదంటూ స్థానికులు గ్రామబహిష్కరణ చేశారు. ఈ విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లడంతో తల్లీ కుమారుడిని వృద్ధాశ్రమంలో చేర్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కష్టకాలంలోనూ గుట్టుగా వ్యభిచారం