Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియా మోటార్స్ కీలక ప్రకటన : మరో రూ.400 కోట్ల పెట్టుబడి

Webdunia
గురువారం, 28 మే 2020 (16:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా కియా మోటార్స్ ఉంది. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైంది. ఆ తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కియా మోటార్స్ తరలిపోతుందనే వార్తలు హల్చల్ చేశాయి. పైగా తన ప్లాంట్ విస్తరణను ఏపీలో నిలిపివేసి, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఈ సంస్థ విస్తరణ పనులు చేపట్టనుందనే ప్రచారం జోరుగా సాగింది. ఆ వార్తలు అలా ఉండిపోయాయి.
 
ఇపుడు కియా మోటార్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు సౌత్ కొరియాకు చెందిన ఈ కార్ల ఉత్పత్తి సంస్థ ప్రకటన చేసింది. రాష్ట్రంలో అదనంగా మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూకున్ షిమ్ తెలిపారు.
 
'మన పాలన - మీ సూచన' కార్యక్రమం సందర్భంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్ గురువారం సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చేశారు. ఏపీతో కియా మోటార్స్‌కు బలమైన బంధం ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments