Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియా మోటార్స్ కీలక ప్రకటన : మరో రూ.400 కోట్ల పెట్టుబడి

Webdunia
గురువారం, 28 మే 2020 (16:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా కియా మోటార్స్ ఉంది. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైంది. ఆ తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కియా మోటార్స్ తరలిపోతుందనే వార్తలు హల్చల్ చేశాయి. పైగా తన ప్లాంట్ విస్తరణను ఏపీలో నిలిపివేసి, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఈ సంస్థ విస్తరణ పనులు చేపట్టనుందనే ప్రచారం జోరుగా సాగింది. ఆ వార్తలు అలా ఉండిపోయాయి.
 
ఇపుడు కియా మోటార్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు సౌత్ కొరియాకు చెందిన ఈ కార్ల ఉత్పత్తి సంస్థ ప్రకటన చేసింది. రాష్ట్రంలో అదనంగా మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూకున్ షిమ్ తెలిపారు.
 
'మన పాలన - మీ సూచన' కార్యక్రమం సందర్భంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్ గురువారం సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చేశారు. ఏపీతో కియా మోటార్స్‌కు బలమైన బంధం ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments