Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికొడుకుతో పాటు 9మందికి కరోనా.. పెళ్లికూతురికి మాత్రం నెగటివ్..

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (12:31 IST)
వివాహ వేడుకలకు పరిమితంగా సభ్యులు హాజరు కావాలని నిబంధలున్నప్పటికీ.. జనాలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. అలాగే చాలా ఫంక్షన్లలో కరోనాకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. దీని ఫలితంగా ప్రజలు కరోనా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో ఒకే ఇంట్లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఇద్దరు పెద్దలు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మమత వెల్లడించారు. దీంతో... అందరినీ హోం ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 
 
ఇలా 9 మందికి కరోనా సోకడానికి కారణం వారి ఇంట జరిగిన వివాహమేనని తేలింది. ఇటీవలే ఈ ఇంట్లో వివాహం జరిగింది. అయితే, కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో.. టెస్ట్ చేయించుకున్నారు. పెళ్లి కుమారుడు సహా ఆ కుటుంబంలోని ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. పెళ్లి కూతురికి మాత్రం నెగిటివ్‌గా వచ్చింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments