Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (18:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 606 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 11,980 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 606 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా 22 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. 
 
అలాగే, మరో 84 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక్క రోజులో ఒక్కటంటే ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. తాజాగా కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,18,858 ఉండగా, ఇందులో 23,03,522 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, ఇప్పటివరకు 14730 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, దేశంలో మొత్తం 3116 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 5559మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 0.41 శాతంగా ఉంది. ఇపుడు దేశంలో 38,069 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,37,072గా ఉంది. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments