దేశంలో స్పల్పంగా పెరిగిన పాజిటివ్ కేసులు .. 313 మంది మృతి

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (10:51 IST)
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో స్వల్పంగా పెరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం గత 24 గంటల్లో ఈ కేసుల వివరాలతో కూడిన మీడియా బులిటెన్‌ను విడుదల చేసింది. 
 
ఆ ప్రకారం గడిచిన 24 గంటల్లో మొత్తం 10488 పాజిటివ్ కరోనా కేసులు నమోదుకాగా, 313 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఈ వైరస్ బారినపడి కోలుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. గత 24 గంటల్లో ఏకంగా 12329 మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. దేశంలో ఈ స్థాయిలో రికవరీలు పెరగడం గత యేడాది మార్చి నెల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
అదేసమయంలో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. అంటే 0.36 శాతానికి తగ్గి 536 రోజుల కనిష్టానికి పడిపోయాయి. ప్రస్తుతం ఈ పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,714గా వుంది. అలాగే, శనివారం దేశ వ్యాప్తంగా 10,74,099 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments