Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగర తీరంలో కరోనా కల్లోలం... ఏపీలో కొత్తగా 14,440 కరోనా కేసులు

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (19:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా సాగర తీరం విశాఖపట్టణంలో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 14,440 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, విశాఖపట్టణంలో రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదయ్యాయి. 
 
ఇక్కడ వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలకు పైగా వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో ఈ జిల్లాలో 2,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఓ కోవిడ్ బాధితుడు కన్నుమూశారు. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం విశాఖలో 15,695 యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో ఏకంగా 46,650 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 14,440 మందికి ఈ వైరస్ సోకింది. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 1,534, గుంటూరులో 1,458, ప్రకాశం జిల్లాలో 1,399, కర్నూలు జిల్లాలో 1,238 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అదేసమయంలో 3,969 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,80,634 మందికి కరోనా వైరస్ సోకగా, 2082482 మంది కోలుకున్నారు. మరో 83610 మంది చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments