Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి వెంకయ్యకు రెండోసారి కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (18:25 IST)
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. 
 
వైద్యుల సూచన మేరకు ఆయన వారం రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అలాగే, ఇటీవల తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఆయన గత 2020 సెప్టెంబరు నెలలో తొలిసారి కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ఉపరాష్ట్రపతి కార్యాలయం అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. "ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు" అని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments