మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు.. 45వేలు దాటిన మృతులు

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (23:00 IST)
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్‌ కేసుల సంఖ్య 17 లక్షలు, మరణాల సంఖ్య 45వేలు దాటింది. కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 4,907 పాజిటివ్‌ కేసులు, 125 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,31,833కు, మరణాల సంఖ్య 45,560కు పెరిగింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 9,164 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,97,255కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రికవరీ రేటు 92.23 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 88,070 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా కేసులు, మృతులపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్‌కు సిద్ధం అంటున్న రామ్ చరణ్

వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?

Sankranti movies: వినోదాన్ని నమ్ముకున్న అగ్ర, కుర్ర హీరోలు - వచ్చేఏడాదికి అదే రిపీట్ అవుతుందా?

మధిరలో కృష్ణంరాజు డయాబెటిక్ వార్షిక హెల్త్ క్యాంప్ ప్రారంభించనున్న భట్టివిక్రమార్క

Netflix: బిగ్గెస్ట్ స్టార్స్ తో 2026 లైనప్‌ను అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

హైదరాబాద్‌లో తమ 25 ఏళ్ల కార్యకలాపాలను వేడుక జరుపుకున్న టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments