Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఏడాదిన్నర బాలుడికి షిగెల్లా..

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (18:59 IST)
Shigella
కేరళను ఓ వైపు కరోనా వైరస్‌, మరోవైపు షిగెల్లా బ్యాక్టీరియా వణికిస్తున్నాయి. తాజాగా గురువారం ఏడాదిన్నర ఏళ్ల బాలుడికి షిగెల్లా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కోజికోడ్ నగర పరిధిలోని ఫిరోక్ ప్రాంతానికి చెందిన బాలుడికి చాలా రోజులుగా విరేచనాలు అవుతున్నాయి. దీంతో పరీక్షలు నిర్వహించగా షిగెల్లా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉన్నదని వైద్యులు తెలిపారు.
 
బాలుడి తల్లిదండ్రుల నుంచి కూడా నమూనాలు సేకరించి పరీక్షకు పంపినట్లు చెప్పారు. గత వారం కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి బారిన పడి 11 ఏళ్ల బాలుడు మరణించడంతో పాటు మరో 30మందికి సోకడంతో కేరళలో కలకలం రేగింది.
 
అయితే షిగెల్లా బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధి గురించి భయాందోళన అవసరం లేదని, ఈ వ్యాధి వ్యాప్తి మూలాలను గుర్తించేందుకు వైద్య నిఫుణులు ప్రయత్నిస్తున్నారని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ చెప్పారు. 
 
కలుషిత నీటి వల్ల షిగెల్లా బ్యాక్టీరియా సోకినట్లుగా ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తుందని వెల్లడించారు. వ్యాధి సోకిన వారి ఇండ్ల నుంచి సేకరించిన నీటి, ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కాచి వడకట్టిన నీటిని తాగాలని ప్రజలకు ఆమె సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments