Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 2 కరోనా బులిటెన్ : 3 వేల మందిని మింగేసిన కరోనా

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ మరో 3 వేల మందిని మింగేసింది. అలాగే, కొత్తగా మరో 1.30 లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో నమోదైన కేసుల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ఆ ప్రకారంగా మొన్న‌టితో పోల్చితే నిన్న కాస్త పెరిగింది. మొన్న దేశంలో 1,27,510 క‌రోనా కేసులు న‌మోదుకాగా, నిన్న 1,32,788 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, నిన్న 2,31,456 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,07,832కు చేరింది. మరో 3,207 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,35,102కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,61,79,085 మంది కోలుకున్నారు. 17,93,645 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
దేశవ్యాప్తంగా 21,85,46,667 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 35,00,57,330 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. మంగళవారం 20,19,773 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments