Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయిన జార్ఖండ్ సీఎం

Webdunia
బుధవారం, 8 జులై 2020 (16:18 IST)
Jharkhand CM
కరోనా దెబ్బకి భారతదేశం విలవిల్లాడిపోతోంది. చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది. ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా కరోనా సోకింది. తాజాగా జార్ఖండ్ రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్‌కు మంగళవారం నాడు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఇటీవలే ఆ మంత్రి సీఎంతో సమావేశం జరిగిన నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. 
 
అయితే ముఖ్యమంత్రికి ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్ళినట్లు అధికారులు తెలియజేశారు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, కార్యాలయంలోని సిబ్బందిని హోం క్వారంటైన్ లోనే ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీఎం కార్యాలయంలోకి వచ్చే విజిటర్స్ పై కూడా అనేక నిబంధనలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 3056 కేసులు పాజిటివ్‌గా నమోదవగా అందులో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments