Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఇటలీ మాజీ అథ్లెట్ డొనాటో సాబియా మృతి

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (19:58 IST)
కరోనా వైరస్‌ కారణంగా ఇటలీకి చెందిన మాజీ అథ్లెట్ డొనాటో సాబియా(56) మృతి చెందాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 83వేలకు పైగా ఉంది. 
 
800 మీటర్ల రేస్‌లో రెండు సార్లు ఒలింపిక్ ఫైనల్స్‌కు చేరిన డొనాటో కోవిడ్‌-19 కారణంగా బుధవారం కన్నుమూసినట్లు ఇటాలియన్ ఒలింపిక్ కమిటీ (సీవోఎన్ఐ) ప్రకటించింది. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న డొనాటో.. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. 
 
1984 లాస్ఎంజెల్స్ ఒలింపిక్స్ 800 మీటర్ల విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన సాబియా.. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఏడో స్థానం దక్కించుకున్నాడు. యూరోపియన్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన డొనాటో మృతి పట్ల సీవోఎన్ఐ సంతాపం తెలిపింది. 
 
మరోవైపు ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత, మాజీ ఆటగాళ్లకు ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అండగా నిలిచింది. సాయం కోసం ఎదురుచూస్తున్న తమ సభ్యులకు అత్యవసర సహాయ నిధి ఏర్పాటు చేసింది. ఉపాధి కోల్పోయి ఆందోళన, ఒత్తిడిలో చిక్కుకున్న ఆటగాళ్లకు తాత్కాలిక సాయం కింద 2.5 లక్షల డాలర్ల నిధిని ఏర్పాటు చేశామని ఏసీఏ జనరల్ మేనేజర్ కెల్లీ యాపిల్‌బీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments