Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఇటలీ మాజీ అథ్లెట్ డొనాటో సాబియా మృతి

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (19:58 IST)
కరోనా వైరస్‌ కారణంగా ఇటలీకి చెందిన మాజీ అథ్లెట్ డొనాటో సాబియా(56) మృతి చెందాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 83వేలకు పైగా ఉంది. 
 
800 మీటర్ల రేస్‌లో రెండు సార్లు ఒలింపిక్ ఫైనల్స్‌కు చేరిన డొనాటో కోవిడ్‌-19 కారణంగా బుధవారం కన్నుమూసినట్లు ఇటాలియన్ ఒలింపిక్ కమిటీ (సీవోఎన్ఐ) ప్రకటించింది. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న డొనాటో.. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. 
 
1984 లాస్ఎంజెల్స్ ఒలింపిక్స్ 800 మీటర్ల విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన సాబియా.. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఏడో స్థానం దక్కించుకున్నాడు. యూరోపియన్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన డొనాటో మృతి పట్ల సీవోఎన్ఐ సంతాపం తెలిపింది. 
 
మరోవైపు ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత, మాజీ ఆటగాళ్లకు ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అండగా నిలిచింది. సాయం కోసం ఎదురుచూస్తున్న తమ సభ్యులకు అత్యవసర సహాయ నిధి ఏర్పాటు చేసింది. ఉపాధి కోల్పోయి ఆందోళన, ఒత్తిడిలో చిక్కుకున్న ఆటగాళ్లకు తాత్కాలిక సాయం కింద 2.5 లక్షల డాలర్ల నిధిని ఏర్పాటు చేశామని ఏసీఏ జనరల్ మేనేజర్ కెల్లీ యాపిల్‌బీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments