ఇరాన్‌లో కరుడుగట్టిన నేరస్థుల రిలీజ్.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (11:38 IST)
ఇరాన్ దేశాలో కరుడుగట్టిన నేరస్థులను ఆ దేశం విడుదల చేసింది. ఈ నేరస్థులపై ఎన్నో రకాలైన కఠిన నేరాలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా రిలీజ్ చేసింది. దీనికంతటికి కారణం కరోనా వైరస్. 
 
కరోనా వైరస్ బారినపడిన టాప్-3 దేశాల్లో ఇరాన్ ఒకటి. ఈ దేశంలో కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 237గా ఉంది. అలాగే, వైరస్ బాధితుల సంఖ్య 7 వేలను దాటింది. దీంతో వివిధ జైళ్ళలో ఉన్న నేరస్థులను విడుదల చేయాలని నిర్ణయించింది. 
 
ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల నేరాలు చేసి, శిక్షను అనుభవిస్తున్న దాదాపు 70 వేల మందిని విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసీ వెల్లడించారు. ఖైదీల విడుదలపై ఇరాన్ పత్రికలు, వెబ్ సైట్లలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. 
 
ఈ నిర్ణయంతో సమాజంలో అభద్రతా భావం కలుగబోదని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. ఇక విడుదల చేసిన వారిని వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి జైళ్లకు తరలిస్తారా? లేదా? అన్న సంగతిని మాత్రం ఆయన వెల్లడించ లేదు. మొత్తంమీద కరోనా వైరస్ దెబ్బకు కరుడుగట్టిన నేరస్థులకు విముక్తి లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments