Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు.. 65 వేలు దాటిన క్రియాశీలక కేసులు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (12:56 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత రెండు రోజులతో పోల్చుకుంటే గణనీయంగా తగ్గాయి. ఆదివారం లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 10 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య 7178గా ఉంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 78342 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 7178 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశంలో 65683 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 16 మంది చనిపోయారు. దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,31,345కు చేరింది. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి ఎక్స్ బీబీ 1.16 రకం వేరియంట్ కారణమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించినప్పటికీ ఈ వేరియంట్ అంత శక్తిమంతమైనది కాదని చెప్పారు. అయినప్పటికీ ప్రజలు రద్దీ ప్రదేశాలకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించి వెళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments