Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలమూరు జిల్లాలో బస్సును ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (12:32 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. కాలేజీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. లారీ సృష్టించిన బీభత్సంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కాలేజీ విద్యార్థులు గాయపడ్డారు. 
 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ ఠాణా సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో ప్రతిభా జూనియర్‌ కళాశాలకు చెందిన బస్సు కొంతమంది విద్యార్థులతో కళాశాలకు వస్తోంది. ఈ  క్రమంలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి ఎదురుగా రహదారిపై మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది.
 
అదేసమయంలో ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న సత్యనారాయణ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కళాశాల బస్సులో ఉన్న విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments