దేశంలో 543 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (11:53 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా 543 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 8774 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,72,523కి చేరింది. 
 
ఇందులో 3,39,98,278 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,05,691 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో మొత్తం 8774 పాజిటిప్ కేసులు నమోదు కాగా, 9481 మంది ఈ వైస్ బారి నుంచి కోలుకున్నారు. అలాగే, 543 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో శనివారం ఏకంగా 4741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల రికవరీ రేటు 98.34 శాతంగావుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments