Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 543 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (11:53 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా 543 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 8774 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,72,523కి చేరింది. 
 
ఇందులో 3,39,98,278 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,05,691 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో మొత్తం 8774 పాజిటిప్ కేసులు నమోదు కాగా, 9481 మంది ఈ వైస్ బారి నుంచి కోలుకున్నారు. అలాగే, 543 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో శనివారం ఏకంగా 4741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల రికవరీ రేటు 98.34 శాతంగావుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments