Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 543 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (11:53 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా 543 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 8774 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,72,523కి చేరింది. 
 
ఇందులో 3,39,98,278 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,05,691 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో మొత్తం 8774 పాజిటిప్ కేసులు నమోదు కాగా, 9481 మంది ఈ వైస్ బారి నుంచి కోలుకున్నారు. అలాగే, 543 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో శనివారం ఏకంగా 4741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల రికవరీ రేటు 98.34 శాతంగావుంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments