Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదియా జిల్లాలో దారుణం.. అంతిమ సంస్కారాలకు వెళుతూ...

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (11:32 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో దారుణం జరిగింది. తమ కుటుంబ సభ్యుని అంతిమ సంస్కారాలకు వెళుతూ 17 మంది మృత్యువాతపడ్డారు. ఈ దారుణం శనివారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నదియా జిల్లాలో తమ కుటుం సభ్యుడు ఒకరు చనిపోయారు. అతని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు ఒక మెటాడోర్ వాహనంలో అంతిమ సంస్కారాలకు బయలుదేరారు. 
 
అయితే ఈ వాహనం రోడ్డు పక్కన ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ అంతిమ సంస్కారాలకు 20 మంది కలిసి మెటాడోర్ వాహనంలో వెళుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments