ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులెన్ని? - పొంచివున్న థర్డ్ వేవ్ ముప్పు!

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (11:12 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన వివరాల మేరకు.. దేశంలో కొత్తగా మరో 18,833 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 3,38,71,881కు చేరింది. 
 
ప్ర‌స్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,46,687 మంది చికిత్స తీసుకుంటున్నారు. యాక్టివ్ కేసులు 203 రోజుల క‌నిష్టానికి చేరాయి. ఇక క‌రోనా నుంచి కొత్త‌గా 24,770 మంది కోలుకున్నారు. మంగళవారం క‌రోనాతో 278 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య‌ 4,49,538కి చేరింది. 
 
మరోవైపు, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) గట్టి హెచ్చరిక చేసింది. భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరించింది.
 
ముఖ్యంగా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, ఝార్ఖండ్, గోవా, హర్యానా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరో రెండు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
 
మరోవైపు వైద్య నిపుణులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టీకాలు వేయించుకోని వ్యక్తులు, పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని చెపుతున్నారు. ఈ సందర్భంగా, ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్ డాక్టర్ శర్మన్ సింగ్ మాట్లాడుతూ, థర్డ్ వేవ్ రావడం, రాకపోవడం ప్రజలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments