Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా 15 వేల కోవిడ్ కేసులు - దేశంలో 90 వేలు - ఫోర్త్ వేవ్ తప్పదా?

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (13:41 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుంది. దీంతో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 90 వేలు దాటిపోయాయి.
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో గత 24 గంటల్లో మొత్తం 15940 కేసులు కొత్తగా నమోదు కాగా, వీటిలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే సగానికిపైగా కేసులు ఉంటున్నాయి. ఇక క్రియాశీల కేసులు భారీగా పెరుగుతూ 90 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. 
 
24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 3,63,103 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొత్తగా నమోదైన కేసులు 15,940 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 4205, కేరళలో 3,981 కేసులు ఉన్నాయి. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉంది. అలాగే, 20 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,974కు చేరుకుంది. అలాగే, ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి  సంఖ్య 12425గా ఉంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసు సంఖ్య 91,779గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments