Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో శుక్రవారం కాస్త తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (11:38 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గత రెండు రోజుల్లో కాస్త పెరుగుతూ వచ్చిన ఈ కేసుల్లో శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా1,32,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 
 
కొత్తగా మరో 2,07,071 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు మరణాలు సైతం తగ్గుతున్నాయి. కొత్తగా 2,713 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది.
 
ఇందులో 2,65,97,655 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 3,40,702 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 16,35,993 యాక్టివ్‌కేసులు ఉన్నాయని చెప్పింది. 
 
ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 93.08 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 7.27శాతంగా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.38 శాతానికి పడిపోయిందని, వరుసగా 11 రోజుల్లో పది శాతానికన్నా తక్కువగా ఉందని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 22,41,09,448 డోసులు చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments