Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కేసులు తగ్గుతుంటే.. మరణాలు పెరుగుతున్నాయ్...

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (09:43 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. కానీ కరోనా వైరస్ సోకిన బాధితుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ఈ విషయాన్ని స్పష్టంచేసింది. 
 
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1.60 లక్షల మేరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో పోల్చితే ఈ కేసుల సంఖ్య 3 శాతం తక్కువ అని తెలిపింది. అయితే, కరోనా మరణాల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతుంది. ఈ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 
 
తాజా నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 1,61,386 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,16,30,885కు చేరుకుంది. ఇందులో 3,95,11,307 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 16,21,603 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 4,97,975 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో మొత్తం 2,81,109 మంది కోలుకోగా 1733 మంది మరణించడం ఆందోళన కలిగిస్తుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments