Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో శవాలదిబ్బగా మారిన గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ మార్చురీ

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (19:53 IST)
గుంటూరు జిల్లాను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. రోజురోజుకి మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. గుంటూరు జీజీహెచ్ లోని మార్చురీ కరోనా మృతదేహాలతో నిండి పోయింది. కరోనాతో చనిపోయిన వారిని తీసుకెళ్లేందుకు బంధువులు భయపడుతున్నా రు. దీంతో జీజీహెచ్ మార్చురీ శవాల దిబ్బగా మారింది.
 
జీజీహెచ్ మార్చురీలో 30 మృత దేహాలు భద్రపరిచే అవకాశమున్నది. కానీ ప్రస్తుతం మార్చురీలో 54 మృతదేహాలున్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు వందకు పైగా కరోనా వైరస్‌కు బలయ్యారు. కరోనాతో చనిపోయిన కుటుంబ సభ్యులు సైతం క్వారంటైన్, కోవిడ్ సెంటర్ ఆస్పత్రులలో ఉంటున్నారు. మరోవైపు కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలో పాల్గొన్నవారికి కరోనా సోకింది.
 
దీంతో కరోనాతో మృతదేహాలను స్వీకరించడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. కరోనా మృతదేహాల అంత్యక్రియలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం గట్టి చర్యలను తీసుకుంటున్నది. దీంతో కరోనా మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించిన చర్యలను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు జీజీహెచ్ సూపరిండెంట్ సుధాకర్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments