కరోనాతో శవాలదిబ్బగా మారిన గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ మార్చురీ

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (19:53 IST)
గుంటూరు జిల్లాను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. రోజురోజుకి మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. గుంటూరు జీజీహెచ్ లోని మార్చురీ కరోనా మృతదేహాలతో నిండి పోయింది. కరోనాతో చనిపోయిన వారిని తీసుకెళ్లేందుకు బంధువులు భయపడుతున్నా రు. దీంతో జీజీహెచ్ మార్చురీ శవాల దిబ్బగా మారింది.
 
జీజీహెచ్ మార్చురీలో 30 మృత దేహాలు భద్రపరిచే అవకాశమున్నది. కానీ ప్రస్తుతం మార్చురీలో 54 మృతదేహాలున్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు వందకు పైగా కరోనా వైరస్‌కు బలయ్యారు. కరోనాతో చనిపోయిన కుటుంబ సభ్యులు సైతం క్వారంటైన్, కోవిడ్ సెంటర్ ఆస్పత్రులలో ఉంటున్నారు. మరోవైపు కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలో పాల్గొన్నవారికి కరోనా సోకింది.
 
దీంతో కరోనాతో మృతదేహాలను స్వీకరించడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. కరోనా మృతదేహాల అంత్యక్రియలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం గట్టి చర్యలను తీసుకుంటున్నది. దీంతో కరోనా మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించిన చర్యలను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు జీజీహెచ్ సూపరిండెంట్ సుధాకర్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments