Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 30వ తేదీన నాసా అంగారకుడి యాత్ర

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (19:47 IST)
NASA
అంగారకుడిపై ఇప్పటికే ఎనిమిది సార్లు విజయం సాధించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా).. తాజాగా ఈ నెల 30వ తేదీన అంగారకుడి యాత్రకు మరోసారి సన్నద్ధమవుతోంది. ఈ నెల 30న మరో రోవర్​ను అంగారకుడి వద్దకు పంపనుంది. అంగారకుడిపై ఇప్పటి వరకు జరిపిన ప్రయోగాల్లో ఈ 'పెర్​సీవరెన్స్​' అతిపెద్దదని, అత్యంత మేధస్సు కలిగినదని నాసా పేర్కొంది.
 
ఈ రోవర్​ ల్యాండింగ్​ కోసం అత్యాధునిక సాంకేతికతను నాసా వినియోగించింది. ఇతర ప్రాజెక్టులతో పోల్చితే.. అంగారకుడిపై చిత్రాలు తీయడానికి, ధ్వనిని రికార్డు చేయడానికి ఇందులోనే ఎక్కువ కెమెరాలు, మైక్రోఫోన్లు అమర్చింది.
 
గ్రహంపై ఉన్న రాళ్లను సేకరించే ట్యూబులు కూడా అత్యంత శుభ్రమైనవని నాసా వెల్లడించింది. ఇతర స్పేస్​క్రాఫ్ట్​ల లాగే పర్​సర్వెన్స్​ కూడా 300మిలియన్​ మైళ్లుకన్నా ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడిపై అడుగుపెట్టే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆరు చక్రాల పెర్​సీవరెన్స్​.. నాసా ప్రతిష్టాత్మక 'క్యూరియాసిటీ' రోవర్​తో పోలి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments