Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోం క్యారంటైన్‍‌లో పుదుచ్చేరి సీఎంతో పాటు 51మంది ఉద్యోగులు

హోం క్యారంటైన్‍‌లో పుదుచ్చేరి సీఎంతో పాటు 51మంది ఉద్యోగులు
, సోమవారం, 29 జూన్ 2020 (13:28 IST)
Puducherry CM
కరోనా పుదుచ్చేరిలో విజృంభిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా.. పేద, ధనిక బేధం లేకుండా కాటేస్తోంది. పుదుచ్చేరిలో ఇప్పటివరకు 648 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుండి 252 మంది కోలుకున్నారు. 
 
తాజాగా పుదుచ్చేరి సీఎంతో పాటు 51 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో నెగటివ్ అని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సీఎం నారాయణస్వామితో పాటు ఇంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అసెంబ్లీ ఉద్యోగులు 51 మందికి పీటీ-పీసీఆర్ పరీక్షలు చేశారు. 
 
అయితే రిపోర్టులో సీఎం నారాయణస్వామితో పాటు 51 మంది సీఎం కార్యాలయ ఉద్యోగులకు కరోనా నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి కుటుంబసంక్షేమశాఖ డైరెక్టరు మోహన్ కుమార్ చెప్పారు. అయినా ముందు జాగ్రత్తగా సీఎం నారాయణస్వామితోపాటు ఉద్యోగులకు వారంరోజుల పాటు హోంక్వారంటైన్ లో ఉండాలని సూచించామని డైరెక్టరు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్నా, నాకు ఊపిరాడ్తల్లేదు, నేను చనిపోతున్నా: కరోనా పేషెంట్ చివరి క్షణాలు