Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోనోక్లోనల్ కాక్‌టెయిల్ మందు తొలిసారి వినియోగం.. కోలుకున్న వృద్ధుడు

Webdunia
గురువారం, 27 మే 2021 (13:00 IST)
కరోనా వైరస్ సోకిన రోగికి మన దేశంలో తొలిసారి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మందును వాడారు. ఈ మందు వాడిని వృద్ధుడైన కరోనా రోగి ఆరోగ్యపరంగా కోలుకున్నాడు. ఈ మందును డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో వాడి త్వరగా కోలుకున్న విషయం తెల్సిందే. 
 
ఈ మందు ఇటీవలే మన దేశంలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మందును మన దేశంలో తొలిసారి వినియోగించారు. హర్యానాలో ఓ రోగికి ప్రయోగాత్మకంగా ఇవ్వగా అతడు కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. మొహబత్‌సింగ్ (84)కి యాంటీబాడీస్ కాక్‌టెయిల్ మందును ఇచ్చామని, ఆయన పూర్తిగా కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జ్ చేసినట్టు మేదాంత ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నరేశ్ తెహ్రాన్ తెలిపారు.
 
ఈ ఔషధం ఆసుపత్రికి వెళ్లే అవసరాన్ని 70 శాతం తగ్గిస్తుందన్నారు. యాంటీబాడీస్ కాక్‌టెయిల్ ఔషధాన్ని అమెరికాకు చెందిన రోచె సంస్థ అభివృద్ధి చేసింది. దీని ఒక్కోడోసు ధర రూ.59,750. కాసిరివిమాబ్, ఇమ్‌డెవిమాబ్ అనే రెండు రకాల ఔషధ మిశ్రమమే ఇది. ఒక్కో ప్యాక్‌లో రెండు డోసులు ఉంటాయి. 
 
ఒక్కో డోసులో 1200 ఎంజీ మందు ఉంటుంది. అన్ని పన్నులతో కలుపుకుంటే ఈ ఔషధం ధర రూ.1,19,500 వరకు ఉంటుంది. తొలి బ్యాచ్‌లో భాగంగా లక్ష ప్యాక్‌లను భారత్‌లో విడుదల చేశారు. ప్రముఖ ఆసుపత్రులు, కొవిడ్ చికిత్సా కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments