టెన్త్ పరీక్షలపై వెనక్కి తగ్గిన ఏపీ.. 12వ తరగతి పరీక్షలు కూడా..

Webdunia
గురువారం, 27 మే 2021 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. క‌రోనా స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసినా… ఏపీ ప్ర‌భుత్వం పరీక్షల నిర్వ‌హ‌ణ‌కే మొగ్గు చూపుతుంద‌ని దాఖ‌లైన పిటిష‌న్ల‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
 
క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో షెడ్యూల్ ప్ర‌కారం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌టం లేద‌ని, పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతానికి ఇప్ప‌టికి ఇప్పుడు స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 
 
టీచర్లను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి టీకాలు వేయలేమని అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షలపై ప్రభుత్వం మళ్లీ జూలైలో స‌మీక్ష చేసి, తుది నిర్ణ‌యం తీసుకోనుంది. కాగా, ఏ పరీక్షలను నిర్వహించి తీరుతామని పదేపదే చెబుతూ వచ్చిన ఏపీ విద్యా శాఖ.. హైకోర్టుకు మాత్రం ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలపడం గమనార్హం. అలాగే, 12వ తరగతి పరీక్షల నిర్వహణపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం