Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య భారతంలోకి అడుగుపెట్టిన కరోనా.. మణిపూర్‌లో తొలికేసు

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (10:58 IST)
ఈశాన్య భారతంలోకి కరోనా వైరస్ అడుగుపెట్టింది. ఫలితంగా మణిపూర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. మణిపూర్‌కు చెందిన ఓ యువతి.. ఇటీవలే బ్రిటన్‌ నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. 
 
యువతి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ యువతి యూకేలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. ఇక ఇప్పటి వరకు భారత్‌లో 470 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిది మంది మరణించారు.
 
మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 500 దాటింది. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తంగా 37 మంది వైరస్ బారిన పడ్డారు. మరోవైపు మహారాష్ట్ర అత్యధికంగా ప్రభావితం అవుతోంది. దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 97 మందికి వైరస్‌ సోకింది. సోమవారం ఒక్క రోజే 23 కొత్త కేసులు వచ్చాయి. కేరళ 95 కేసులతో రెండో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments