థర్డ్ వేవ్ ఇబ్బందికరమే.. నవంబర్‌లో మళ్లీ ముప్పు తప్పదా?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (19:11 IST)
సెకండ్ వేవ్ దేశంలో జూన్ చివరి నాటికి అదుపులోకి వచ్చినా.. నవంబర్‌లో థర్డ్ వేవ్ కారణంగా మాత్రం మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది కంట్రోల్ చేయాలంటే వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా కొనసాగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తికి ఇమ్యూనిటీ మూడు నుంచి 6 నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత అదే వ్యక్తి మరోసారి వైరస్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్ని బట్టి సుమారుగా 5 నుంచి 6 నెలల తర్వాత మరో ముప్పు ఉండే అవకాశం ఉంది. అప్పటికి ప్రజల్లో రోగనిరోధకత తగ్గే ఆస్కారం ఉంటుందని, అందుకే మళ్లీ నవంబర్ నెలలో కేసులు ఆందోళనకర స్థాయికి చేరే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
 
వైరస్ విజృంభిస్తున్న సమయంలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలను అనుమతించడం వల్లే దేశంలో సెకండ్ వేవ్ ఉధృతికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి కేసుల్లో పెరుగుదల కనిపించినప్పటికి ప్రజారోగ్య వ్యవస్థ సరిగా స్పందించడంలో విఫలం అయ్యిందని ప్రొ.మూర్తి తెలిపారు. 
 
ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య ప్రకారం దక్షిణాదితో పాటు పశ్చిమ రాష్ట్రాల్లో వైరస్ ఉధృతి జూన్ చివరి నాటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేశారు. 
 
ఇక తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య జూలై మధ్యకాలం వరకు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే దేశంలో 30ఏళ్లు పైబడిన వారిలో 80శాతం మందికి వ్యాక్సిన్ అందించడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments