Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కరోనా కేసులు.. కొత్త రికార్డు.. 3,700 మంది మృతి

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (23:41 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో రికార్డులపై రికార్డులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో కొత్త కేసులు 2,50,000 దాటగా మరణాలు 3,700 దాటాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ గణాంకాలు వెల్లడించాయి. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు అమెరికాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,07,291గా వుంది. గత నెల రోజులుగా అమెరికాలో కొవిడ్‌ కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. 
 
ప్రస్తుతం ఈ వైరస్‌తో ఆస్పత్రి పాలైన వారి సంఖ్య 1,13,000గా వుంది. అమెరికాలో కరోనా గణాంకాలకు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో అంకెలకు అస్సలు పొంతన లేకుండా వుంది. అమెరికా జనాభాలో ఐదు శాతం మందికి లేదా దాదాపు కోటీ 70లక్షల మందికి ఈ వైరస్‌ సోకింది. కాగా అమెరికా ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్‌ ఆరంభించింది. ఈ వారం చివరికల్లా 29లక్షల డోసులను సేకరించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. 
 
వచ్చే ఏడాదికల్లా వ్యాక్సిన్‌ విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలోగా అమెరికా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ కుప్పకూలేలా వుందని అమెరికా సిడిఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ ఇప్పటికే హెచ్చరించారు. బైడెన్‌ వచ్చే వారం వ్యాక్సిన్‌ తీసుకోనుండగా, ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ దంపతులు శుక్రవారం టీకా వేయించుకోనున్నారని వైట్‌హౌస్‌ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments