Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఆటలు కాదు.. ఓసారి గెలిచి మరోసారి ఓడిన యువ డాక్టర్!

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2020 (16:21 IST)
కరోనా వైరస్ సోకిన రోజులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, అజాగ్రత్తగా వ్యవహరించినా పైలోకాలకు వెళ్లక తప్పదు. ఈ మాటలు ఎవరో చెప్పలేదు. సాక్షాత్ ఓ యువ వైద్యుడి విషయంలో అనుభవపూర్వకంగా నిరూపితమైంది. కరోనా వైరస్ బారినపడిన ఆ వైద్యుడు... తొలుత విజయం సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఈ వైరస్ బారినపడి మృత్యువొడిలోకి చేరుకున్నాడు. ఈ విషాదకర ఘటన కడప జిల్లా బద్వేల్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చింది. బద్వేల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడుగా నందకుమార్ పని చేస్తున్నారు. ఈయన కరోనాతో కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. నందకుమార్ వయసు 28 సంవత్సరాలు. ఆయన మూడు నెలల కిందట కరోనా బారినపడి కోలుకున్నారు. ఆపై తన విధులకు హాజరవుతున్నారు. 
 
అయితే, ఇటీవలే మళ్లీ కరోనా సోకింది. రెండు వారాల కిందట జ్వరం రావడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఇంటివద్దే చికిత్స పొందారు. తగ్గకపోవడంతో కడప రిమ్స్ కు వెళ్లారు. 
 
అక్కడ్నించి తిరుపతి స్విమ్స్‌కు, ఆపై చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్ నందకుమార్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పనిచేసిన ఆసుపత్రిలో సిబ్బంది, బంధుమిత్రులు తీవ్రవిచారానికి లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments