Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి మరో కొత్త కరోనా వేరియంట్...బీ.1.1.28.2

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (18:17 IST)
భారత్‌లోకి మరో కొత్త కరోనా వేరియంట్ కాలు పెట్టినట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తాజాగా గుర్తించింది. బ్రెజిల్, ఇంగ్లండ్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో దీన్ని గుర్తించామని పేర్కొంది. ఈ కొత్త వేరియంట్‌ శాస్త్రీయ నామం బీ.1.1.28.2. ఈ వేరియంట్ వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 
 
ప్రస్తుతమున్న కరోనా టీకాలు ఈ వేరియంట్‌ను నిర్వీర్యం చేయగలవో లేదో తెలుసుకునేందుకు మరింత అధ్యయనం జరగాల్సి ఉందని వారు చెప్తున్నారు. కాగా.. దేశంలో కరోనా రెండో వేవ్ వెనుక బీ.1.617 రకం వేరియంట్లు ఉన్నట్టు పది పరిశోధన శాలలు జరిపిన తాజాగా అధ్యయనంలో బయటపడింది. ఈ రకం వేరియంట్ తొలుత మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. 
 
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలోనూ ఈ వైరస్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్‌కు చెందిన మూడు ఉపజాతులు అంటే..బీ.1.617.1, బీ.1.617.2, బీ.1.617.3 ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. వీటిలో బీ. 1.617.2 మిగితా వాటికంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కరోనా రెండో వేవ్‌కు ఇదే ప్రధాన కారణమనే అభిప్రాయం నిపుణుల్లో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్‌కు 'డెల్టా' అని నామకరణం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments