Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిన కేంద్రంగా ఆర్ఆర్ఆర్ లేఖాస్త్రాలు - ఈ దఫా గవర్నర్లకు...

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (17:45 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో కూర్చొని తనపై ఏపీ సీఐడీ పోలీసులు రాజద్రోహం కేసును సుమోటా నమోదు చేయడం, ఈ కేసులో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే ఒక్క ఏపీ సీఎంకు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. మంగళవారం దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు రఘురామ లేఖ రాశారు. త్వరలో గవర్నర్ల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో, సెక్షన్ 124ఏ రద్దు చేసే అంశంపై ఆ సదస్సులో చర్చించాలని రఘురామ తన లేఖలో కోరారు.
 
ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసి దారుణంగా వ్యవహరించారని ఆరోపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు.... తన ఆక్రోశాన్ని లేఖల రూపంలో వెలువరిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, రాజద్రోహం సెక్షన్ దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తావించినందుకు తనపై కేసులు పెట్టారని వివరించారు. అక్రమ కేసులతో వేధించారని తెలిపారు. ఏపీ సీఎం వ్యక్తిగత కక్షతో తనపై కేసులు పెట్టించారని ఆరోపించారు. ఏపీ సీఐడీ కార్యాలయంలో సీఐడీ డీజీ నేతృత్వంలో తనను క్రూరంగా హింసించారని తెలిపారు.
 
ఓ సిట్టింగ్ ఎంపీపై దేశద్రోహం నేరం మోపడం, ఓ ఎంపీని కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం ఇదే తొలిసారి అని రఘురామ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లానని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే గవర్నర్ల సదస్సులో మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాగా, రాజద్రోహం కేసులో అరెస్టు అయిన రఘురామరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments