Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రఘురామ కాళ్ళలో దెబ్బతిన్న కణజాలం... రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్

రఘురామ కాళ్ళలో దెబ్బతిన్న కణజాలం... రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్
, శుక్రవారం, 28 మే 2021 (08:36 IST)
రాజద్రోహం ఆరోపణలపై రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే కస్టడీలో తనను దారుణంగా కొట్టారంటూ రఘురామ ఆరోపించడంతో కోర్టు వైద్య పరీక్షలకు ఆదేశించింది. ఆర్మీ ఆసుపత్రి వైద్య పరీక్షల్లో ఆయన కాలి వేలు ఫ్రాక్చర్ అయినట్టు వెల్లడైంది.
 
ఇక, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందిన రఘురామకు ఇటీవలే బెయిల్ మంజూరైంది. ఈ కేసు గురించి, ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని న్యాయస్థానం రఘురామను ఆదేశించింది.
 
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో రఘురామ కాళ్లలో కణజాలం తీవ్రంగా దెబ్బతిన్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దీంతో రఘురామ రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్ డాక్టర్లు రెండు వారాల విశ్రాంతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రఘురామరాజు ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైక్స్‌‌ను తొలగించే అవకాశాన్ని అందిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌- ఫేస్‌బుక్‌