Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని!!

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (17:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలను ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. ఈ ప్రకటన మేరకు... ఏపీలో గడచిన 24 గంటల్లో 85,311 కరోనా పరీక్షలు నిర్వహించగా 10,413 మందికి కరోనా పాజిటివ్ కేసులు సోకినట్టు తేలింది. 
 
ఇందులో అత్యధికంగా తూర్పు గోదావరి (2,075), చిత్తూరు (1,574) జిల్లాలను మినహాయిస్తే, మిగిలిన అన్ని జిల్లాల్లో వెయ్యికి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 293 కేసులు గుర్తించారు.
 
మరోవైపు, 15,469 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 83 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మరణించగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది కన్నుమూశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 11,296కి చేరింది. 
 
మరోవైపు, దేశంలో గడిచిన 24 గంటల్లో 1,32,364 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఆ ప్రకారంగా 2,07,071 మంది కోలుకున్నారు. 
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది. మరో 2,713  మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,40,702కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,65,97,655 మంది కోలుకున్నారు. 16,35,993 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 22,41,09,448 మందికి వ్యాక్సిన్లు వేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments