Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో గుబులు పుట్టిస్తున్న పెట్రోల్ ధర.. 2 జిల్లాల్లో ధర తగ్గింపు

ఏపీలో గుబులు పుట్టిస్తున్న పెట్రోల్ ధర.. 2 జిల్లాల్లో ధర తగ్గింపు
, శుక్రవారం, 4 జూన్ 2021 (15:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీని దాటేసింది. దీంతో వాహనచోదకులు వాహనం తీయాలంటే భయపడిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ, కడప జిల్లాల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా ధరను తగ్గించింది. విశాఖలో లీటర్‌పై రూ.19 పైసలు, కడపలో రూ.17 పైసలు తగ్గించడంతో ఈ రెండు జిల్లాల్లో లీటర్‌ ధర వందకు దిగువకు చేరింది.
 
అలాగే, మిగిలిన జిల్లాల్లోని పెట్రోల్ ధరలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.80 పైసలు, చిత్తూరులో రూ.101, తూర్పు గోదావరిలో రూ.100.23, పశ్చిమగోదావరిలో రూ.101.23, కృష్ణా జిల్లాలో రూ. 100.70పైసలుగా ఉంది. 
 
అదేవిధంగా గుంటూరులో రూ.100.89, కర్నూల్‌లో రూ.101.03, నెల్లూరులో రూ.100.30, విజయవాడలో రూ.100.89, ప్రకాశం జిల్లాలో రూ.100.67, శ్రీకాకుళంలో రూ.100.68, విజయనగరంలో రూ.100.04, విశాఖలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 99.90, కడపలో లీటర్‌ ధర రూ.99.93గా ఉంది. 

అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో రూ.94.76, ముంబైలో రూ.100.98, కోల్‌కతాలో రూ.94.76, చెన్నైలో రూ.96.23 పైసలు చొప్పున ఉంది. ఈ పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నప్పటికీ కేంద్రం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు