దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (11:06 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5,476 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
 
అలాగే, గత 24 గంటల్లో ఈ వైరస్ బారినపడిన వారిలో 158 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మరో 9,754 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 59,442 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, ఈ బాధితులంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం 4,23,88,475 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, కరోనా వైరస్ రెండో అల ప్రారంభమయ్యేందుకు ఆరు నెలల సమయం పట్టింది. అటు కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి రెండో వేవ్ ప్రారంభమయ్యేందుకు 4 నుంచి 5 నెలల సమయం పట్టింది. కరోనా థర్డ్ వేవ్‌తో మహమ్మారి ముగిసిపోతుందని భావిస్తున్నారు. 
 
అయితే, కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు మాత్రం జూన్‌లో నాలుగో దశ కరోనా వేవ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ ఫోర్త్ వేవ్ జూన్‌లో ప్రారంభమై అక్టోబరు వరకు కొనసాగుతుందని పరిశోధకులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా ఎఫెక్ట్.. టాలీవుడ్ హీరోల కళ్లపై కునుకు లేకుండా చేస్తోన్న రిషబ్ శెట్టి?

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది :సంతోష్ శోభన్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

Nabha Natesh: మహాశివరాత్రికి మైథలాజికల్ యాక్షన్ డ్రామా నాగబంధం టీజర్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments