Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు.. బ్రెజిల్ వెనక్కి నెట్టి రెండో స్థానానికి భారత్

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:16 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో 90వేలకు పైగా రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా అదే తీవ్రత మళ్లీ కనిపించింది. కరోనా మరణాల్లోనూ అదే స్థాయిలో ఉధృతి కనిపిస్తోంది. 
 
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1115 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 43,70,129కి చేరుకుంది. ఇప్పటిదాకా 73,890 మంది మృత్యువాత పడ్డారు. 
 
దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,97,394కు చేరుకుంది. 33,98,845 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్‌ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. 
 
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో ఇప్పటికే భారత్ రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిల్‌ను మూడోస్థానంలోకి నెట్టేసింది. అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. అమెరికా ప్రస్తుతం 65,14,231 కేసులతో టాప్‌లో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments