ఏపీలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 2331 కేసులు.. 11మంది మృతి

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (22:36 IST)
ఏపీలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకూ కేసులు సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. తాజాగా రాష్ట్రంలో కేసులు 2 వేల మార్క్ కూడా దాటిపోయాయి. గత 24 గంటల వ్యవధిలో 31,812 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2331 మందికి పాజిటివ్ అని తేలింది. ఇందులో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368, కృష్ణా జిల్లాలో 327 కేసులు వెలుగుచూశాయి. 
 
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి మొత్తం 11మంది మృతి చెందగా, ఇప్పటివరకు 7,262 మంది మరణించారు.  
 
చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూల్‌లో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు అలాగే విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఏపీలో ప్రస్తుతం 13,276 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,53,02,583 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
 
తాజా కేసులతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,10,379కి చేరింది. ఇందులో ఇప్పటికే 8,89,841 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక యాక్టివ్ కేసులు 1300 దాటిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 13,276 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments