Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో 66మందికి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా లేకుంటే..?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (11:06 IST)
హైదరాబాదులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా కూకట్‌పల్లి ప్రాంతంలో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 13, హస్మత్‌పేటలో 14, ఎల్లమ్మబండలో 8, మూసాపేటలో 2, పర్వత్‌నగర్‌లో 3, బాలానగర్‌లో 23, జగద్గిరిగుట్టలో ముగ్గురికి చొప్పున పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.
 
అలాగే కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో గురువారం 396 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 44కి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కుత్బుల్లాపూర్‌ యూపీహెచ్‌సీలో 12 మందికి, గాజులరామారం యూపీహెచ్‌సీలో ముగ్గురికి, షాపూర్‌నగర్‌ యూపీహెచ్‌సీలో 19 మందికి, సూరారం యూపీహెచ్‌సీలో నలుగురికి, దుండిగల్‌ పీహెచ్‌పీలో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి వై.నిర్మల తెలిపారు.
 
ఓల్డుబోయినపల్లి డివిజన్‌ పరిధిలో గురువారం 75మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హస్మత్‌పేటలో 64 మందికి పరీక్షలు నిర్వహించగా 14మందికి, అంజయ్య నగర్‌లో 11 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకపోతే..కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments